Tuesday, 29 December 2015

పాట : 34 : మన్మధుడివి నువ్వేరా మనోహరా..

పల్లవి:
మన్మధుడివి నువ్వేరా మనోహరా..
మాయ చేసిన ఏకవీర రశేశ్వరా..
సరసస్వరూపం నువ్వేరా..
నన్ను నేనే మరచినారా సుధాకరా
మందరమై పూసినారా మగధీరా..
నాలోని సర్వం నీదేరా..

చరణం 1:
చూపులతో కాల్చేసే కన్నే నీదా
నీ చిలిపిదనం చిరునామా నా చెక్కిలిలో కనుగొన్నా..
నవ్వులతో చంపేసే జిన్నే నువ్వా..
నా పడుచుదనం నజరానా నీ తెగువకు రాసేసా..
తేనెసొగసులు చిలికిన ప్రణయం..
తనువంత తాకింది వింత మోహం...సరసస్వరూపం నువ్వేరా..                  //నన్ను నేనే//

చరణం 2:

వెన్నెలను చిందించే మూనే నువ్వా...
నులివెచ్చదనపు ఆనందం నీ కౌగిలిలో కనుగొన్నా..
మల్లెలను మరపించే మత్తే నీదా..
మదిపచ్చదనపు సౌందర్యం నా నీకే ఇచ్చేసా..
బుగ్గనచుక్కకు ఎదురుచూసే తరుణం..
ఎద నిండిపోయింది మధురస్వప్నం...నాలోని సర్వం నీదేరా...          //మన్మధుడివి//

No comments:

Post a Comment