పల్లవి:
అతను: మనసయ్యింది నీపై ఎద మీటావనే..
మధుమాస చిరునవ్వులతో నన్ను దోచావనే..
ప్రియా ప్రియతమా..నువ్వే సరిగమా..
ఆమె: మధువయ్యింది నేనే నిన్ను చేరాలనే..
పల్లవించు గీతాలలో నన్ను దాచావనే..
ప్రియా ప్రియతమా..నేనే నీ గమకమా..
చరణం 1:
ఆమె: నీ ఊహలోకొచ్చి చేరిపోయా..ప్రియురాలిగా నన్ను కలగన్నావనే..
నీ కన్నుల్లోకొచ్చి విరినయ్యా..రెప్పల్లో దాచుకుంటావనే..
అతను: ఊరించే ఊహలు..కలగలసిన కన్నులూ..
మైమరచే ఊసులూ..జతకలిసిన బాసలూ..
ఆమె: బంధాలై పెనవేసెను ప్రేమల్లో..
అతను: స్వర్గాలై విరబూసెను కౌగిలిలో..
ప్రియా ప్రియతమా..నువ్వే సరిగమా..
చరణం 2:
ఆమె: జడివానకే నే ఒణుకుతున్నా..వెన్నెల చల్లనై కురిసిందని..
కస్తూరినై పరిమళించా..సురద్వారం తెరిచుందని..
అతను: కవ్వించే పరువాలు..రేకెత్తెను మోహాలు..
చెరవేసే అందాలు..అవునంటే సరసాలు..
ఆమె: రాగాలై విరితేనెల పాటల్లో..
అతను: తాపాలై వెలిగిన చూపుల్లో..
ప్రియా ప్రియతమా..నేనే నీ గమకమా..
No comments:
Post a Comment