Hi
friends..My feelgood Song for today...
పల్లవి:
ఏ శుభమూర్తమో ఇది..ఏ ఆమని గీతమో ఇది
నిత్యవసంతమై పాడింది మది..
ఎదలోయల్లో మునుపెరుగని సడి..
చరణం 1:
మధుమాస గీతికలేవో పెదవులపై పలికినవి..
తొలిసంధ్యల కానుకలేవో కన్నులపై ఒదిగినవి..
ఆరుకాలాలూ ఏకమై ఒకే ఋతువుగా శోభిల్లినవేమో
కలహంస అడుగుల ఒయ్యారాలు
అరవిరిసిన పువ్వుల సౌందర్యాలు..
మురిసిపోదా మనసు..కురిసిపోదా మధువు.. //ఏ శుభమూర్తం//
చరణం 2:
నీలిమబ్బు సోయగమేదో నా మనసును అల్లినది
కలకోయిల కూజితమేదో హృదివీణను మీటినది
సప్తస్వరాలూ ఏకమై ఒకే రాగమాలపించెనేమో
నెమలికులుకుల ఆ హొయలు..
చిగురుటాకుల స్వర గలగలలు..
తరించిపోదా తనువు..వరించిరాదా మనువు.. //ఏ శుభమూర్తం//
No comments:
Post a Comment