చరణం
ఇంద్రజాలికుడివా..మనోరంజిల్లింది
మూగైన నా మనసు
ఉల్లాసనాదానివా..తలఊచింది పులకించిన
నా శిరసు
ఎవరివో..నీవెవరివో..
పల్లవి 1
ఒంటిచేతికి చప్పట్లు రావని
రెండుచేతులూ కలిపావు
కలిసున్నా చేతివేళ్ళు దేనికవే
ప్రత్యేకమనీ తెలిపావు
చెలిమందించే చేతులవిలువ చాటి చెప్పావు
చీకటి జగాన కరదీపికవై దివ్వెలు
నింపావు
ఎవరివో..నీవెవరివో..
పల్లవి 2
మనసుంటే మార్గం దొరుకునని మంత్రమే
వేసావు
ఊహాశక్తితో చరిత్ర మారునని స్పష్టం
చేసావు
మంచితనానికి వన్నెతరగదని ఋజువు చూపావు
నాలో మనిచిని మేల్కొలిపి స్పందన
నేర్పావు
ఎవరివో..నీవెవరివో..
No comments:
Post a Comment